మహాకూటమికి పూర్తి ఆధిక్యం
posted on Nov 8, 2015 @ 9:43AM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మహా కూటమి ఆధిక్యంలోకి వచ్చినప్పటి నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకుని వెళ్తూనే వుంది. ఆదివారం ఉదయం పదిన్నర సమయానికి మహా కూటమి 155 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎన్డీయూ కూటమి 79 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వుంది. అంటే, ఎన్డీయే కూటమి కంటే రెండింతల ఆధిక్యంలో మహాకూటమి వుంది. కౌటింగ్ ప్రారంభ సమయంలో ఆధిక్యం వచ్చిన సందర్భంగా బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. ప్రస్తుతం మహా కూటమి కంటే ఎన్డీయే కూటమి కంటే బాగా వెనుకబడి వుండటంతో ఎన్డీయే వర్గాలు తలలు పెట్టుకున్నాయి. అయితే ముందు ముందు ఎన్డీయే కూటమి ముందంజలోకి వచ్చే అవకాశం వుందన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి.