ఎన్టీఆర్ మానవతా వాది: రేవంత్
posted on Jan 25, 2014 @ 11:04AM
నందమూరి తారకరామారావు సమైక్యవాది అని ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ ఆయన గొప్ప మానవతా వాది అని రేవంత్ రెడ్డి అన్నారు. విభజన బిల్లుపై చర్చ సంధర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడానికే ఎన్టీఆర్ టిడిపి పార్టీ స్థాపించారని అన్నారు. తెలంగాణ యువతకు అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ భావించారని, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే కేసీఆర్, ఎర్రబెల్లి, బాలయోగి, ఎర్రన్నాయుడు, యనమల, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు తదితర ఆణిముత్యాల వంటి నేతలు ఈ దేశానికి లభించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకువచ్చి ఆయన ప్రజలకు మేలు చేశారని అన్నారు.