ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు కర్నాటకలో ఫిర్యాదు..
posted on Jun 8, 2015 @ 5:43PM
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం దాని వెనుక తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నాడంటూ ఎన్నో అనుమానాలు, ఆరోపణల మధ్య ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. దీని ఆజ్యం పోసినట్టుగా స్టీఫెన్ సన్ ను చంద్రబాబు ప్రలోభ పెట్టారంటూ నిన్న రాత్రి దానికి సంబంధించిన ఆడియో టేపులను టీన్యూస్ ఛానల్ లో బయటపెట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి నిప్పులు చెరుగుతోంది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అభ్యర్ధులు, తెదేపా అభ్యర్ధులు పోటాపోటీగా ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమను ప్రలోభపరిచారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసుల ఎదుట వాంగ్మూలాలు నమోదు చేస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేతలు తమను ప్రలోభపరిచారంటూ తెలంగాణ టీడీపీ నేతలు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే టీడీపీ వాంగ్మూలాలు తెలంగాణ పోలీసులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో కర్నాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏసీబీ ఎప్పుడెప్పుడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడదామ అనే గట్టి ప్రయత్నమే చేస్తుంది. అయితే స్టీఫేన్ సన్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించడానికి లేదా విచారణ జరపడానికి ఏసీబీ ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.