నేడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ
posted on Jun 26, 2015 8:18AM
ఓటుకి నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ పిటిషన్ కేసు ఈరోజు హైకోర్టు విచారణకు చేపడుతుంది. మొన్న వారి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎసిబి న్యాయవాదులు ఈకేసులో తమకు ఒక కీలకమయిన సమాచారం లభించిందని కనుక దానిని సమర్పించేందుకు సోమవారం వరకు సమయం కావాలని అంతవరకు రేవంత్ రెడ్డి తదితరులకి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు. కానీ హైకోర్టు వారికి ఈరోజు వరకే గడువు ఈయడంతో వారు చెప్పినట్లుగా ఆ కీలకమయిన ఆధారాలు ఈరోజు కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది. అప్పుడే వారు రేవంత్ రెడ్డి తదితరుల జ్యూడిషియల్ కస్టడీ పొడిగించమని కోరగలుగుతారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఎసిబి కోర్టుకి అందింది. దాని కాపీ కోసం ఎసిబి అధికారులు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసి ఉన్నారు కనుక ఒకవేళ అది చేతికి అందినట్లయితే దానినే వారు హైకోర్టు కి సమర్పించి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పోదించమని కోరుతారేమో?