ఏపీ తెలంగాణలో రెడ్ జోన్లు ఇవే..!
posted on May 1, 2020 @ 12:17PM
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం, జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ రాశారు. గతంలో నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చసినట్లు ప్రీతి సూడాన్ వెల్లడించారు. కొత్త జాబితా ప్రకారం రెడ్ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్ జోన్లో 284, గ్రీన్ జోన్లో 319 జిల్లాలు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 19 జిల్లాలు, మహారాష్ట్ర లో 14, తమిళనాడు లో 12, ఢిల్లీ 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో జోన్ల వివరాలు..
ఆంధ్రప్రదేశ్ లో ఐదు జిల్లాలు రెడ్ జోన్ లో, 7 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో, 1 జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
రెడ్జోన్ జిల్లాలు : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
ఆరెంజ్ జోన్ జిల్లాలు : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ
గ్రీన్ జోన్ జిల్లా: విజయనగరం.
తెలంగాణలో.. ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో, 18 ఆరెంజ్ జోన్ లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
రెడ్ జోన్ జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్ జిల్లాలు: నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల.
గ్రీన్ జోన్ జిల్లాలు: పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి.