సుప్రీంకోర్టుపై రాయపాటి తీవ్ర ఆరోపణలు
posted on Mar 5, 2014 @ 1:28PM
ఈరోజు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనంపై తీవ్ర ఆరోపణలు చేసారు. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వంటి కేంద్రమంత్రులు కొందరు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో దాఖలయిన అనేక పిటిషన్లను కోర్టు పరిగణనలోకి తీసుకొని స్టే విదించకుండా న్యాయమూర్తులను మేనేజ్ చేసారని రాయపాటి ఆరోపించారు. మరి కాంగ్రెస్ పార్టీ, సుప్రీంకోర్టు ఈ ఆరోపనలపై ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. గత వారం ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ ప్రకటిస్తారని తెలిపారు. కానీ ఆ మాట చెప్పి వారం రోజులయినా ఇంకా కొత్త పార్టీ రాకపోవడంతో ఆయన మళ్ళీ ఈ రోజు కొత్త పార్టీకి మరో సరికొత్త ముహూర్తం ప్రకటించారు. మరో వారం పది రోజుల్లో కిరణ్ తన కొత్త పార్టీ ప్రకటిస్తారని మీడియాకు తెలిపారు.