Read more!

హాఫ్ సెంచరీ చేయనున్న నాయక్

 

మెగాభిమానులకు ఒక శుభవార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అమలా పాల్, కాజాల్ అగర్వాల్ నటించిన ‘నాయక్’ సినిమా ఈ నెల 27వ తేదిన రాష్ట్రంలో 55థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకోబోతోంది.అంతే కాదు, పక్కనున్నకర్ణాటక రాష్ట్రంలోకూడా మన ‘నాయక్’5 థియేటర్లలో దిగ్విజయంగా ‘హాఫ్ సెంచరి’ చేయబోతున్నాడు. ఇవి కాక బీ, సి సెంటర్లలోకూడా నాయక్ మంచి జోరు మీదున్నట్లు సమాచారం.

 

రాష్ట్రంలో 55థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకోబోతున్న సెంటర్ల వివరాలు:

 

నైజాం:9; సీడెడ్:15; నెల్లూరు:1; కృష్ణ; 4; గుంటూరు:8; తూర్పుగోదావరి:6; పశ్చిమ గోదావరి:4; వైజాగ్:8; కర్ణాటక:5. ఇవికాక మిగిలిన జిల్లాల వివరాలు ఇంకా అందవలసి ఉంది.

 

వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దానయ్య మరియు రాధాకృష్ణ కలిసి నిర్మించారు. తమన్ సంగీత దర్శకత్వం చేసారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, రఘుబాబు, రాహుల్ దేవ్, ఆశిష్ విద్యార్ధి, ప్రదీప్ రావత్, అజాజ్ ఖాన్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.