వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
posted on Sep 30, 2016 @ 11:21AM
భారత్-పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దుల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ నుండి ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని.. సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. అయితే ఈరోజు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. పంజాబ్లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తోన్న భారత సైనికులు అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో సైనిక శిబిరాల ఏర్పాటు చేసుకుంటున్నారు. పంజాబ్ లో గురుద్వారలోనూ సైనికులు శిబిరాలు ఏర్పాటయ్యాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రకటించిన హై అలర్ట్ కొనసాగుతోంది.