రాహుల్ అపరిపక్వ రాజకీయాలు

 

 - డా. ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]

 

 

నేటి దేశ పార్లమెంటరీ వ్యవస్థలో శాసనవేదికలలో సభ్యులైన ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ పరిణామం పార్లమెంటరీ వ్యవస్థకే తీవ్రమైన అగ్నిపరీక్ష'' - గురుదాస్ గుప్తా (ప్రసిద్ధ పార్లమెంటేరియన్)

 

దేశ సంపదగా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రకటించిన రేడియోతరంగాలపై గుత్తాధిపత్యం చెలాయించడానికి దేశ, విదేశీ టెలికాం సంస్థలు పోటాపోటీలు పడుతూ భారతదేశ ఆర్ధికవ్యవస్థకు నష్టదాయకంగా పరిణమించి, స్వలాభాపేక్షతో లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేయడానికి సంబంధించిన భారీ కుంభకోణాన్ని "కాగ్''తో పాటు దేశం దృష్టికి తెచ్చినవాడు గురుదాస్ గుప్తా. ఇందులో ఇరుక్కున్న వాళ్ళు కేవలం బడాబడా కంపెనీలు మాత్రమేకాదు, ప్రధానమంత్రీ, ప్రధానమంత్రి కార్యాలయమూ, కేంద్రప్రభుత్వపు పెంపుడు కంపెనీగా బహిర్గతమైపోయిన అంబానీల "రిలయన్స్'' కూడా ఉన్నాయి; వీరికి తోడూ 2-జి స్కామ్ లో తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం, మాజీమంత్రి రాజా (డి.ఎం.కె), ఒక సిబీఐ ఉన్నతాధికారి కూడా ఉన్నారు!


అయితే ఈ కుంభకోణంలో అభియోగాల్ని విచారించే పేరిట నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అభియోగాల్ని ధృవీకరించగా, అదీ చాలదన్నట్టు "మంత్రుల పరిశీలనా సంఘాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినప్పుడు ఆ కమిటీ ముందుకు. అంతకుముందు పార్లమెంటరీ సంయుక్త సంఘం ముందుకువచ్చి ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తాను చేబుతాననీ, తనను పిలవాలనీ మాజీమంత్రి రాజా పదేపదే కోరారు. అయినా అతన్ని పిలవనేలేదు. అన్నీ "సర్దుకున్న తరువాత''నే ప్రధానమంత్రి కార్యాలయం గానీ, మన్మోహన్ సింగ్ గానీ అవసరమైతే "నేనూ సిబీఐ విచారణకు సిద్ధమే''నని 'దొంగలు పడిన ఆరునెలలకు' ఏవో మొత్తుకున్నట్టుగా ప్రకటనలు చేస్తూ వచ్చారు; చివరికి బొగ్గు కుంభకోణంలో వచ్చిన ఆరోపణల విషయంలో కూడా, రోజులకు రోజులు గడిచిపోయిన తరువాత, విదేశీ పర్యటనల తరువాత అంతా "సద్దుమణిగినట్టు'' కన్పించిన తరువాత విమాన ప్రయాణంలో మన్మోహన్ నేనూ విచారణకు సిద్ధమేనని ప్రకటించారు!
 

సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల ఫలితంగానే ప్రధానమంత్రి కార్యాలయానికీ "బొగ్గు'' తవ్వకాలలో ఉన్న కంపెనీల తాలూకూ కుంభకోణాలకూ ఉన్న సంబంధాన్ని సిబీఐ డైరెక్టర్ బయట పెట్టవలసి వచ్చింది. వీటన్నింటినీ గురుదాస్ గుప్తా బహిర్గతం చేశారు. అలాగే కాంగ్రెస్ - యు.పి.ఎ. ప్రభుత్వానికీ, "రిలయన్స్'' అంబానీలకూ కె.జి.గ్యాస్ తవ్వకాలు, "డి-6''బ్లాక్ లో ఉత్పత్తిని కృత్రిమంగా నియంత్రిస్తున్న [ఒప్పందాలకు విరుద్ధంగా] అంబానీల ఆగడాలకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా దేశప్రజల దృష్టికి తెచ్చినవాళ్ళు ప్రధానంగా ఇద్దరే ఇద్దరు - (1) ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2) గురుదాస్ గుప్తా!

 

ఈ పూర్వరంగంలో, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రేపటి ప్రధానమంత్రి పదవికోసం అర్రులుచాచి తన తల్లీ, కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధి అండతో, ఎదిగే క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా కాంగ్రెస్ అధిష్ఠానం "ప్రమోట్'' చేసిన రాహుల్ గాంధీ ఇటీవల తన రాజకీయ అపరిపక్వతను చాటుకొంటున్నాడు! ప్రధానమంత్రి పదవికి 2014 ఎన్నికల అనంతరం రావాలని ఆశపడుతున్న తొందర్లో రాహుల్, ఇటీవల ఆగమేఘాల మీద దొడ్డితోవన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్రతో వచ్చిన నేరచరితులైన పార్లమెంటు సభ్యులపై 'వేటు'ను తప్పించే ఆర్డినెన్సును బాహాటంగా "బుద్ధిలేని'' చర్యగా ఖండించాడు. అదీ ఎలా? అంతకుముందు సుప్రీంకోర్టు నేరచరితులైన లేజిస్లేటర్లు ప్రజాప్రనిధులుగా తగరనీ, వారంతా ఆరేళ్ళపాటు తిరిగి ఎన్నికలలో పాల్గొనరాదని చారిత్రాత్మకమైన తీర్పు చెప్పిన వెంటనే రాష్ట్రపతి లోపాయికారీగా క్యాబినెట్ చర్యతో విభేదిస్తూ నర్మగర్భంగా హెచ్చరించిన తరువాత ఆ విషయం తెలిసిన రాహుల్ గాంధీ 'మెరుపు'లా ఆ ఖ్యాతిని తాను కొట్టేసే దుడుకుతనంతో ఆర్డినెన్సు కాపీని ప్రదర్శనకోసం పత్రికలవారి ముందే చించేసి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఘోరంగా అవమానపరిచాడు!

 

అది చాలాక మన్మోహన్ ఏమనుకుంటారోనని తల్లీ, కొడుకులిద్దరూ విదేశపర్యటనలో ఉన్న మన్మోహన్ ను "దువ్వుతూ'' పుండుమీద కారంచల్లినట్టుగా 'వేరే, ఉద్దేశంతో అన్నవి కావు, పట్టించుకోవద్ద'ని బుజ్జగించడానికి ప్రయత్నించారు. సరిగ్గా ఆ అవమానానికి నిరసనగా మన్మోహన్ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసి, రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పదేళ్ళుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్న రాహుల్ తాను 50వ 'వడి'లో ప్రవేశించి, రేపటి ప్రధానమంత్రి పదవిని ఆశిస్తు, తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సందర్భంలో - పిల్లవాడి స్థాయికి మించి ఎదగలేకపోయాడని చెప్పి తీరాలి. ప్రకటనల్లో హుందాతనంగాని, వైజ్ఞానిక దృక్పధంగాని లేని వ్యక్తిగా లోకానికి రాహుల్ కనపడుతున్నాడని గుర్తుంచుకోవాలి; ఆ ప్రకటన ద్వారా రాహుల్ కాంగ్రెస్ లో ఎవడికివాడే "సూపర్ మాన్''గా ఫోజులు పెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రకటనలిచ్చు కోవచ్చునన్నలైసెన్సు ప్రకటించినట్టయింది.
 

మాజీమంత్రి శశిథారూ వెంటనే అంతమాటా అన్నాడు కూడా: "రాహుల్ అలా ప్రకటించిన తరువాత మా సొంత అభిప్రాయాల్ని మేమూ ప్రకటించుకోవచ్చునన్న ధైర్యం మాకొచ్చింద''న్నాడు! బహుశా తమ కుటుంబాల అక్రమాస్తుల రక్షణ కోసమే, లేదా అవినీతి పాలవుతున్న, లేదా గురుదాస్ గుప్తా అన్నట్టు "లెజిస్లేటర్ల రాజకీయ ప్రమాణాలు దిగజారి పోతున్నందు''ననే "సమాచారహక్కు చట్టం'' పరిథిలోకి కాంగ్రెస్ లాంటి (మిత్రపక్షాలు సహా) అవినీతికర రాజకీయ పక్షాలు రాకుండా జాగ్రత్తపడడం కోసమే తన పార్టీ ప్రభుత్వం ఎలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందో రాహుల్ కు తెలియదా? కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్, అనేక కుంభకోణాలతో, అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి 2014లో కూడా అధికారం కట్టపెట్టడానికి పన్నిన చిట్కా - కేవలం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రయోజనాల రక్షణ కోసం భావోద్రేకాల్ని రెచ్చగొట్టబోవటం. "ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంచితే, భారతీయ జనతాపార్టీ (బిజెపి) మాత్రం ప్రజల్ని విడగొడుతున్నద''ని రాహుల్ ప్రచార ఆరోపణ!


కాని 1947 నాటి రాజ్యాంగ నిర్ణయ సభా తీర్మాన స్ఫూర్తికే ఈ రెండుపక్షాలూ (కాంగ్రెస్, బిజెపి) వ్యతిరేకం. కులాతీతమైన లౌకిక వ్యవస్థకు (సెక్యులరిజం) దేశ రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, మతసంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని నాటి రాజ్యాంగ నిర్ణయసభ తీర్మానం! ఆ ప్రాతిపదికపైనే స్వతంత్ర భారతదేశంలో ఈ రెండుపార్టీలు ఎన్నికల సంఘం ముందు హామీపడ్డాయి. కాని ఆచరణలో దేశ మైనారిటీల మౌలిక ప్రయోజనాలను ఆచరణలో కాపాడకుండానే ఎన్నికలలో మాత్రం వారి వోట్ల ద్వారా లబ్ది పొందడం మాత్రమే ఈ రెండు పార్టీల లక్ష్యం! అందువల్ల ప్రజల్ని తమతమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం చీల్చుతూ ఉండటం ఈ రెండింటి వకాలికమైన లక్షణం. "విభజన రాజకీయాలు'' రెండింటి ఉమ్మడి ప్రయోజనాలకు, ఉనికికి అవసరం! ఈ తప్పుడు "విభజన సూత్రం'' దేశ విభజనతో పాటే ప్రాణం పోసుకుంది. విభజించి పాలించమనే ఇండియాలో బ్రిటీష సామ్రాజ్య పాలనతోనే అమలులోకి రాగా, విభజన రాజకీయాలనుంచి తాము ఎన్నికల ప్రయోజనాల కోసం దూరం కాకుడన్నది కాంగ్రెస్, బిజేపీ మౌలికమైన విధాన, వ్యూహాలని మరచిపోరాదు!


 

ప్రస్తుతం రానున్న ఎన్నికలకు మధ్యంతరంగా ఎన్నికలకు సిద్ధమైన కొన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్న రాహుల్ చేస్తున్న ప్రసంగాలు పిల్ల తరహాగా ఉన్నాయి. కాంగ్రెస్ లోని మహామహా కొమ్ములు తిరిగి ఉన్న వివిధ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులలో నూటికి 90 మందికి పైగా నెహ్రూ - ఇందిర కుటుంబానికి తమ ఆత్మగౌరవాన్ని కూడా మరిచిపోయి సోనియా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ కు ఆమె కుటుంబానికే విచక్షణా రహితంగా దాసోహమవడం వల్లనే మంచి యువతరం, యువరక్తం కాంగ్రెస్ వైపునకు మరలడంలేదు. మరలనందున నాయకత్వం చేస్తున్న పనేమిటి? సెంటిమెంట్ ను (మనోభావాల్ని) పోగొట్టుకోవటం; ఆ వరసలో రాహుల్ ఉచ్చరించిన సంప్రదాయమంత్రం - "నా నాయనమ్మను, నా తండ్రిని చంపేశారు. ఏదో ఒకరోజున నన్నూ చంపేస్తారు. అయినా నేను బాధపడ్డం లేదు, కంగారు పడ్డమూ లేదు అన్నాడు!''


 

కాని నాయనమ్మ హత్యగానీ నాన్న రాజీవ్'' హత్యకు గానీ దోహదపడిన పరిణామాలేవీ? ఏ పరిస్థితుల్లో ఆ ఘోరాలు జరిగాయి? చిరకాలంగా కాంగ్రెస్ కు సేవలందించిన బింద్రెన్ వాలా [శిక్కు]ను సాకింది కాంగ్రెస్ పెంచి పోషించింది కాంగ్రెస్. కాని పంజాబ్ ను కృత్రిమంగా విభజించిన తరువాత ఎదురైనా సమస్యల్లో ఒకటి బింద్రెన్ వాలా కాంగ్రెస్ కు దూరమయి పంజాబ్ శిక్కులకు ప్రత్యేక రాష్ట్రంగా 'ఖలిస్తాన్'ను ప్రకటించాలని ఉద్యమం ప్రారంభించాడు. అది హింసాత్మకంగా పరిణమించింది. పంజాబ్ విభజన ఎప్పుడైతే పంజాబ్ శాసనసభ ఆమోదం లేకుండా, శాసనసభను లెక్కజేయకుండా ఏకపక్షంగా రెండుగా పంజాబ్, హర్యానాలుగా చీల్చడానికి కాంగ్రెస్ ఎప్పుడు నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచీ పంజాబీల (శిక్కుల) ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అలాగే బిజెపి - ఎన్.డి.ఎ. ప్రభుత్వం హయాములో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లను కృత్రిమంగా విభజించి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలను ఏర్పరిచారు! వాటిని దేశ, విదేశీ బడా గుత్తా పెట్టుబడిదారులకు దోపిడీ కేంద్రంగా బిజెపి, కాంగ్రెస్ లు మార్చాయి!

 

రాజస్థాన్ ఎన్నికల పర్యటనలో మాట్లాడుతూ రాహుల్ "ప్రజలు సమైక్యంగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాని బిజెపియే రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని విడగొడుతుంద''ని ఆరోపించారు. కాని అవే రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కూడా పనిచేస్తుందన్న వాస్తవాన్ని రాహుల్ మభ్యపెట్టాడు. దేశం ఐక్యంగా ఉండాలని ఒక వైపున కోరుకుంటున్న రాహుల్, విభజించి-పాలించే బ్రిటీష రాజనీతికి తలొగ్గిన కాంగ్రెస్ అదే స్వప్రయోజనాల కోసం, తాను సాధికారికంగానే భాషకు ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వెన్నుదన్నుగా ఏర్పడిన తొలి కమీషన్ (ఫజల్ ఆలీ) సిఫారసులపైన ఏర్పడిన భాషా ప్రయుక్తంగా ఏర్పడిన తెలుగుజాతి తొలి రాష్ట్రమయిన "ఆంధ్రప్రదేశ్''ను నిట్టనిలువునా చీల్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు కంకణం కట్టుకున్నదో వివరించ గలగాలి!


 

ఇందిరాగాంధి పోలీసు - సైనిక సమూహాలతో "ఆపరేషన్ బ్లూస్టార్'' పేరిట దారుణమైన దాడులకు ఖలిస్తాన్ వాదుల మీద పాల్పడడం ద్వారా శిక్కులు అసహనంతో ఉగ్రవాదులుగా మారి ఎదురు మరొక దుస్సాహమైన దుర్మార్గానికి దిగింది. ఫలితంగా ఆమెను సొంత రక్షకులే హత్యగావించారు! దానికి ప్రతిగా ఢిల్లీలో ఇందిరాగాంధి హత్యతో ప్రత్యక్ష సంబంధం లేని 3000 మంది శిక్కులను హతమార్చడం జరిగింది. వేసిన విచారణ కమీషన్ లు కూడా ఈ ఘటనకు విస్తుపోయి, ఈ ప్రతీకార ఘటనలకు ఎవరు కారకులో, వారిని శిల్శించాలని పేర్లుసహా యిచ్చినా, శిక్కుల గాథ ముగియలేదు. ముగియలేదు కనుకనా, ఢిల్లీలో శిక్కులపై జరిగిన మారణకాండతో సోనియాకు గానీ, రాజీవ్ గాంధీకి గాని సంబంధం లేకపోయినా,ఇటీవల వైద్యచికిత్సల నిమిత్తం అమెరికా వెళ్ళిన తన తల్లి (సోనియా) అక్కడి ఖలిస్తాన్ శిక్కుసంస్థలు అమెరికా కోర్టుల ద్వారా ఆసుపత్రికి వెళ్ళి మరీ "సమాన్లు''జారీ చేయించాయి! అలాగే మాజీప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన దారుణ హత్యకూ, శ్రీలంకలో తమిళులపై శ్రీలంక ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధకాండకు అండగా భారత సైన్యం వెన్నుదన్నుగా వెళ్ళి నిలబడడానికీ సంబంధం ఉందని, శ్రీలంకలో మన సైనికజోక్యం లేకపోతే రాజీవ్ మనకి దక్కేవాడనీ పలువురు వ్యాఖ్యాతలు ఆ రోజుల్లో పేర్కొనడమూ కొత్తగాదు.


 

అందువల్ల మనం స్వతంత్రమైన విధానాలకు లక్ష్యాలకూ దూరమవుతున్న కారణంగానే అమెరికా విసిరిన "సంస్కరణల''వలలోకి మనం చిక్కుబడి పోయిన కారణంగానే, ఇరుగుపోరుగుతో సంబంధాలు 65ఏళ్ళ తర్వాత కూడా కుడుతపడకుండా ఉన్నందున కూడా - దేశానికి చిక్కు సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా గమనిస్తే మంచిది! అందువల్ల రాహుల్ అనవసర భయాలు తనలో పెట్టుకుని, సెంటిమెంట్ కోసం చౌకబారు ప్రకటనలు చేయకూడదు. హుందాతనం గల రాజకీయవేత్తగా ఆయన ఎదగాలని కోరుకుందాం! ఉన్మాదులకు తోడ్పడే "సెంటిమెంటల్ ఉప్పును'' అందించకూడదు! రాహుల్ చిరంజీవిగా ఉండాలన్న కోర్కె తప్ప మరొకటి దేశప్రజలకు ఉండదు గాక ఉండదు. నిజానికి గాంధీజీని చంపినవాడు నాధూరామ్ గాడ్సే అనే పరమ హిందూమతోన్మాది, నేటి బిజెపి పూర్వపు 'బ్రాండ్' అయిన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తే అయినా, గాంధీజీ ఆదర్శాలను అనుక్షణమూ 'పాతరేస్తున్న'వారు మాత్రం అవినీతి గోదాలోకి పీకమొయ్యా దిగిపోయిన నేటి కాంగ్రెస్ నాయకులేనని రాహుల్ గుర్తించితే, దేశ సమస్యలకు పరిష్కారం చూడగల్గవచ్చునేమో!

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 4)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 5) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ బీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.