టీఆర్ఎస్ లోకి పొంగులేటి.. తుమ్మల నడిపిన రాజకీయం..!
posted on Apr 5, 2016 @ 6:48PM
వైసీపీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పొంగులేటి చేరిక వెనుక మాత్రం తుమ్మల నాగేశ్వరరావు హస్తం ఉందని అంటున్నారు రాజకీయ పెద్దలు. మంత్రి తుమ్మల నడిపిన రాజకీయ ఫలితమే తెలంగాణాలో వైసీపీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పాయం వెంకటేశ్వర్లు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయినట్టు సమాచారం. మరోవైపు ఏపీ నుండి మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.