ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోడీ స్పెషల్ బర్త్ డే విషెస్
posted on Dec 21, 2020 @ 9:53AM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తన 48 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అయనకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, లోక్ సభ స్పీకర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. ప్రధానితోపాటు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ.. "ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాభినందనలు. సుదీర్ఘకాలం పాటు మీరు ఆరోగ్యంతో ఉండాలని.. భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అన్నారు.
ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అని తన ట్విట్టర్ అకౌంట్ లో తెలుగులో ట్వీట్ పెట్టారు.