Read more!

అవినీతి నాయకుడు లేక సమర్ధవంతమైన నేత

 

 

 

 

టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు 'నారా లోకేష్' చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. “ఒకరు అసమర్ధ నాయకుడు, మరొకరు అవినీతి నాయకుడు, వారిని ఎంపిక చేసుకుంటారా?లేక సమర్ధవంతమైన నేతను ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు.


చంద్రబాబు సుధీర్ఘ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నారని, అధికారం కోల్పోయి పదేళ్లు అవుతున్నా తెలుగుదేశం పార్టీ అభివృద్దిని నినాదంగా చెబుతుందని అన్నారు. గత మూడేళ్లలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు కోట్లు వెచ్చించి చేపట్టామని అన్నారు. అప్పుడప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చి కార్యకర్తలతో భేటీ అవుతున్న నారా లోకేష్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.