Read more!

నామా పై మండిపడ్డ కెటిఆర్

 

 

తెరాస, టిడిపి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దమ్ముంటే ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సవాల్ కు కెసిఆర్ కుమారుడు తారక రామారావు స్పదించారు. నామా నాగేశ్వరరావు ముసుగులో ఉన్న సమైక్యవాది అని ఆరోపించారు. ఖమ్మం నుంచి తాము పోటిచేస్తామని చెప్పకుండా, తెలంగాణ వాదం ఖమ్మంలో బలంగా ఉందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ నామా నాగేశ్వరరావు కేసీఆర్ మీద అనవసర విమర్శలకు దిగుతున్నారని అన్నారు. రెండువేల తొమ్మిదిలో కెసిఆర్ ను జైల్లో పెడితే ఆ జిల్లాకు చెందిన యువత సత్తా చూపారని కూడా ఆయన అన్నారు.