జియో యూజర్స్ కి గుడ్ న్యూస్...
posted on Dec 1, 2016 @ 2:25PM
ఇప్పటికే ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటాతో సంచలన సృష్టించి.. మిగిలిన నెట్ వర్క్ లకు చెమటలు పట్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది జియో వినియోగదారుల ముందుకు. అదేంటంటే ఇంతకు ముందు జియో ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా ఆఫర్ ను ఈ నెల 3వతేదీ వరకు మాత్రమే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. నేడు జరిగిన వాటాదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని.. ప్రస్తుతం జియో సిమ్ను 5 కోట్ల మంది వాడుతున్నారని, నెంబర్ పోర్టబులిటీ స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సిమ్ సౌలభ్యం తీసుకొస్తామన్నారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. జియో వినియోగదారులకు మిగతా నెట్వర్క్లు సహకరించడం లేదని ముఖేష్ అంబానీ ఆరోపించారు. సంచలమైన ఆఫర్లతో సెప్టెంబర్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులతో పాటు ఇతరాత్ర ఉచిత సేవలు డిసెంబర్ 3తో ముగియనున్న సంగతి తెలిసిందే.