కరోనాకు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మృతి
posted on Nov 12, 2020 @ 10:50AM
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహమ్మారితో చనిపోయేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనాను కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. కరోనా సోకడంతో ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు జీనా. నిన్న రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.ఎమ్మెల్యే జీనా భార్య
ఇటీవలే గుండెపోటుతో చనిపోయారు. ఆమె చనిపోయిన కొన్ని రోజులకే జీనా మృతి చెందడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 8 డిసెంబరు 1969లో అల్మోరా జిల్లాలోని సాదిగావ్లో జీనా జన్మించారు జీనా. 2007లో తొలిసారి బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 47,905 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,83,917 కి చేరింది. గత 24 గంటల్లో 52,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 550 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో దేశంలో మొత్తం కరోనా మహమ్మారి మృతుల సంఖ్య 1,28,121 కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 80,66,502 మంది కోలుకోగా.. 4,89,294 యాక్టివ్ కేసులున్నాయి.