కేజ్రీవాల్ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ
posted on Nov 24, 2012 @ 2:16PM
సామాజిక కార్యకర్త, అవినీతి ఉద్యమకారుడు అరవింద కేజ్రీవాల్ తమ కొత్త పార్టీకి 'అమ్ ఆద్మీ' పేరును ప్రకటించారు. 350 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25 మంది సభ్యులతో ఆమ్ఆద్మీ పార్టీకి కోర్కమిటీని ఏర్పాటు చేశారు. తమది ప్రజల పార్టీ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. స్వరాజ్ స్థాపనే లక్ష్యంగా సామాన్య ప్రజల అభ్యున్నతే పార్టీ లక్ష్యంగా ఈ సరికొత్త ఉద్యమపార్టీ ఉండబోతోందని కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు. తన మద్దతుదారులతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. కేజ్రీవాల్ పార్టీలో యోగీందర్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, శాంతిభూషణ్ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించనున్నారు.