Read more!

కవితకు అధిక రక్తపోటు కోర్టులో మరో పిటిషన్ 

 సాధారణంగా ఈ డీ కేసులంటే రాజకీయనాయకులు భయపడుతుంటారు.ఈడీ కేసుల్లో  ముఖ్యంగా మూడు విషయాలు వారిని భయకంపితులను చేస్తాయి.  నెంబర్ వన్ ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం కోర్టు పర్మిషన్ లేకుండానే ఎంతటి వారినైనా అరెస్ట్ చేయవచ్చు. ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. నెంబర్ టూ  ఈడీ కేసుల్లో ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం సాక్ష్యుల వాంగ్మూలాలు సేకరించి అరెస్ట్ చేయవచ్చు. ఒక వేళ తప్పు జరిగితే మాత్రం ఈడీ అధికారుల మీద ఎటువంటి చర్య ఉండదు.నెంబర్ త్రీ   ఈడీ కేసుల్లో నిందితులను కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితులను చూసినట్టే చూస్తారు కానీ అరెస్ట్ చేసే ముందు  నిబంధనలు పెద్దగా పాటించరు. వి ఐపి కర్టెసీ లేకుండానే కటకటాల్లో తోసేస్తారు. ఈ మూడు కారణాలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత బీపీ పెంచేలా చేసింది. కవితకు మునుపెన్నడూ లేని బీపీ రికార్డ్ నమోదైంది. సాధారణంగా 120 బై 80 ఉంటే నార్మల్ గా భావించాలి. కవిత అరెస్ట్ తర్వాత హై బీపీ వచ్చినట్లు కవిత న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కవిత అరెస్ట్ తర్వాత దిక్కులేని మనిషయ్యింది. వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న తన తండ్రి కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం కవిత బీపీ పెరగడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు.  కవిత కొడుకు ఆర్యను చూడగానే ఎమోషనల్ అయి గట్టిగా పట్టుకుని ఏడ్చినట్టు కుటుంబసహ్యులు పేర్కొన్నారు. హైబీపీ కారణంగా  జైలులో కవిత ఆధ్యాత్మిక పుస్తకమైన భగవద్గీత  చదవడం ,సాత్వికాహారం, పండ్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమె కుటుంబసభ్యులు  పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే, కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్ ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.