జేసీ బ్రదర్స్...టిడిపి కన్ ఫార్మ్..!!
posted on Jan 8, 2014 @ 12:28PM
తెలుగు దేశం పార్టీలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులు చేరబోతున్నారని రాజకీయ వర్గాలలో, మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరి రాక ఖాయమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. దీనికి టిడిపి అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల23 లేదా 24న టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని జేసీ బ్రదర్స్ చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో పయ్యావుల కేశవ్ కీలకపాత్ర పోషించాడని తెలుస్తోంది. మరోవైపు జేసీ రాకను పరిటాల సునీత పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పరిటాల హత్య కేసులో జేసీ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడని, ఇతర హత్యల కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేతను ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఆమెను ఒప్పించే బాధ్యతను జిల్లా నేతలకు బాబు అప్పగించినట్లు సమాచారం.