ఆదివాసీల ప్రాణాలకు విలువలేదా?

బస్తర్‌గూడ ఎన్‌కౌంటర్‌ లోతుల్లో కెళితే ఆదీవాసీలు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం, పోలీసులు, అటవీశాఖ,కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, మావోయిస్టులు వీళ్లంతా వారి జీవన సౌలభ్యాన్ని కొల్లగొడుతున్న వారే.. .ప్రభుత్వం వారికి విద్యా,వైద్యం, ఆహారం ఏదీ అందుబాటులో ఉంచదు. పోలీసులు (కేంద్రబలగాలు)వారి ప్రాణాలను చాలా తేలిగ్గాతీసుకుంటారు. కాంట్రాక్టర్లు వారిని తల్లిఒడిలాంటి అటవినుండి తరిమేస్తున్నారు. అక్కడ వ్యవసాయం చేసేందుకు ఆదీవాసీలు కానివారు అటవీశాఖనుండి భూముల్ని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వారికి చెందిన భూముల్లో వారే కూలీలుగా మారుతున్నారు.ఆదీవాసీలు సాంప్రదాయ సిద్దంగా అడవిలో పండే కుంకుడు, శీకాకాయ, బీడీ ఆకు కొన్ని రకాలయిన వేర్లు , తేనే,అమ్ముకుంటూ వుంటారు. అయితే వారిని అడవిలోనికి అటవీశాఖవారు రానీయటం లేదు.కాంట్రాక్టర్లు అడవిలోని చెట్లను నరికి యూకలిప్టస్‌ లాంటి వాణిజ్య మొక్కలను నాటి ఆదీవాసీలకు బ్రతుకుతెరువు లేకుండా చేస్తున్నారు. అటవీశాఖ జులుం వీరి మీద అధికంగా ఉంది. ఆదీవాసీలు వారి దయా దాక్షిణ్యాలపై బ్రతక వలసి వస్తుంది.

 

అడవిబిడ్డలు అడవి దాటి కొండలకి కోనలకు ఎగబ్రాకవలసి వస్తుంది. ఈ కొండలన్నీ ఇనుము,మ్యాంగనీసు, బాక్సైటు లాంటి ఖనిజాలతో ఉన్నాయి కాబట్టి పారిశ్రామిక వేత్తల కళ్లు వాటిమీద ఉన్నాయి. ప్రభుత్వానికి పరిశ్రమలు పెట్టి కాసులు కురిపిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అడవులనుండి, కొండలనుండి వారిని తరిమి కొడుతున్నారు. ఆకలితో ,రోగాలతో వాళ్ల జనాభా రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇది చాలదన్నట్లు పోలీసుల ఎన్‌కౌంటర్‌ పేరుతో అమాయకులను, ఆడవాళ్లని, పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు.

 

గత ఏడేళ్లలో దాదాపు పదివేలమంది చనిపోయారని తెలుస్తుంది. ఇప్పటికే మూడువేల మంది జైళ్లలో మగ్గుతున్నారు.వీరిలో చాలా మంది మీద చార్జిషీటుకూడా పెట్టలేదు. ఇది ఆదీవాసీ బ్రతుకు చిత్రం. ఈ ఛిద్రబ్రతుకుల్లో వారి కన్నీరును తుడవటానికి, వాళ్ల బాగోగులు చూడటానికి ఎవరున్నారని ..మనం చదువుకున్న తోడేళ్లం..చదువుకొని ....ఉన్న నీతిని పోగొట్టుకున్న వాళ్లం...మనకు రూపాయలనబడే కాగితాలే తెలుసుగాని ....ప్రాణాలకు విలువేంటి అని లెక్కలువేసుకుంటాం....అందుకే వాళ్లు అడవుల్లోనూ ఉండలేక జనారణ్యాల్లోనూ చోటు లేక బిక్కుబిక్కు మంటూ చూస్తున్నారు.

 

వాళ్లూ మనుషులే అనుకునే ఏ కొద్దిమందో వారికోసం పరితపిస్తే ప్రభుత్వం వారిని జైళ్లలో తోస్తుంది. మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌ను పరిశీలిస్తే...ఆదీవాసీలంతా ఆరోజు రాత్రి సమావేశం అయ్యి ఎక్కడ భూమిని సాగుచేద్దామా అని సమావేశం జరుపుతున్న సమయంలో సిఆర్‌పియఫ్‌ దళాలు వారి మీద దాడికి దిగాయి.... పెద్దలు...కాస్త తెలివైన వాళ్లు పోలీసులని గుర్తించినవారు చేతులు పైకెత్తి నిలుచుండిపోయారు. పిల్లలు, ఆడవాళ్లు తుపాకీ శబ్దాలకు భయపడినవారు పరుగెత్తి ప్రాణాలను కోల్పోయారు.

 

అయినా టెక్నాలజి మీద ఆధారపడిన పోలీసులు రాత్రిపూట లైట్లులేకుండా ఎలా కూంబింగ్‌కి ఎలా వెళ్లారు...ఎవరేమిటో నిర్థారణకు రాకుండా చీకట్లో కాల్పులు జరపటమేనా...వాళ్లకు అడవి ఎంతవరకు తెలుసు....అక్కడికి పోలీసులు కేవలం రెండు రోజుల ముందే వచ్చి, ఈ సంఘటన జరిగే ప్రదేశానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సిఆర్‌పియఫ్‌ దళాధిపతిగా వీరప్పన్‌ను ఫాలో చేసి చంపిన విజయకుమార్‌ ఉన్నారు. వారేమంటున్నారంటే మేము కాల్పులు జరిపే టైమ్‌లో మావోయిస్టులు ఆదీవాసీలను మానవకవచాలుగా వాడుకున్నారని అదే జరిగిఉంటే అక్కడ పోలీసులకి మావోలపై కాల్పులు జరపటం తెలీదనే చెప్పాలి. ఎందుకంటే మావోయిస్టుల వ్యూహాలను అంచనావేయగలిగే నిపుణత లేని వారు అడవుల్లో మావోయిస్టుల్ని మట్టుబెట్టటానికి వెళ్లారు....ఆదీవాసీల ప్రాణాలను తీసారు. అడవిబిడ్డల కోసం ప్రభుత్వం చేసింది శూన్యం. అమాయకులు చనిపోయిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ చిదంబంకు పార్లమెంటులో అడిగే వరకు తెలియదట....ఒకవేళ అమాయకులు చనిపోతే సారీ అని దులుపుకున్నారు. ఆదీవాసీలంటే ఎంత చులకనో ఈ సంఘటనే చెబుతుంది.

 

ఆదీవాసీలంతా ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారనటానికి నిదర్శనం ప్రభుత్వం పంపిన నిత్యావసర వస్తువులను ఒక్కరంటే ఒక్కరు కూడా తీసుకోకుండా తిప్పి పంపడమే. దీని ద్వారా వారు గుండెకోత కంటె కడుపు మంట ఏమంత లెక్కలోనిది కాదని చెప్పకనే చెప్పారు. ఆదీవాసీలలో విద్యావ్యాప్తి కోసం రామకృష్ట మిషన్‌ 25 పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇదివరలో రామకృష్ణ మిషన్‌ స్కూల్‌దగ్గర చౌక ధరల దుకాణం ఏర్పాటు చేసేవారు .ఇప్పుడు అవి పోలీసుల క్యాంపులకు తరలించారు దానివల్ల ఆదీవాసీలు 40 కిలోమీటర్లు నడవాల్సివస్తుంది.

 

ఇదివరలోఆదీవాసీలకు భూమికోసం జరిగే పోరాటాలు మాత్రమే ఉండేవి...అయితే ఇప్పడు కార్పొరేట్‌ సంస్థలతో అది పోరాడ వలసి వస్తుంది. ప్రభుత్వం ధర్మల్‌ ప్లాంట్లకు , ఖనిజ పరిశ్రమలకు విపరీతంగా అనుమతులు ఇచ్చింది.ఇప్పటికే ఆదీవాసీ ప్రాంతాల్లో 22 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఆదీవాసీల హృదయ విదారక స్థితికి కారణం, ప్రభుత్వ అలసత్యం . ఆదీవాసీల కోసం జరపవలసిన పధకాలు, హక్కులు పేపర్లమీదే ఉన్నాయి.

 

వారికి ప్రతిఘటించే శక్తికూడా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు చత్తీస్‌ఘడ్‌లో గాని, వేరే చోట్లగాని ఆదీవాసీలకు మద్దతుగా ఒక్క బహిరంగ సభ కూడా జరగలేదు. హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సభకు బాధిత కుటుంబాలు పాల్గొనటానికి వస్తే అక్కడే వారిని అరెస్టు చేసినట్లు తెలుసింది.....ఆదీవాసీలను బ్రతకనిద్దాం..ఎందుకంటె ఎప్పుడన్నా మనిషెవరు అంటే చూపటానికి వుంటారు.... మనమెలాగూ టెక్నాలజీతో మెషిన్స్‌గా బ్రతుకుతున్నాం కదా.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”