ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారట!
posted on Mar 21, 2020 9:02AM
ఇరాన్లో కరోనా విలయం తాండవం చేస్తోంది. ప్రపంచం అల్లాడిపోతోంది. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్ లాంటి దేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా మూడో స్టేజ్ లోకి వెళ్లిపోవటం.. రోజు తిరిగే సరికి కరోనాకు ఎఫెక్ట్ అయ్యే వారు వందల నుంచి వేలల్లోకి వెళ్లిపోతోంది. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం చిక్కుకుంది.ఇరాన్ లో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి ఆ దేశానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రతి గంటకు ఇరాన్ లో 50 మంది వరకూ కరోనాకు గురి అవుతున్నట్లు చెప్పారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున కరోనా కారణంగా మరణిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యం కావట్లేదన్న మాటను వారుచెబుతున్నారు.
ఇప్పటి వరకూ ఆ దేశంలో కరోనా కారణంగా 1200 మంది మరణిస్తే.. తాజా లెక్కల ప్రకారం 18400 మంది ప్రజలు కరోనా బారిన పడినట్లుగా ఆ దేశ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న రిపోర్టుల ప్రకారం ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారని.ఇరాన్ అధికారులు తెలిపారు.
పరిస్థితి ఇంత దారుణంగా వుండటంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు. తమను తాము కాపాడుకోవాటానికి ఇరాన్ ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. దర్గాలకు, మతగురువుల సమాధుల వద్దకు వెళ్లి అక్కడి గోడల్ని..గ్రిల్స్ లను నాకుతున్నారు.
ఒకపక్క కరోనా లాలా జలం (ఉమ్మి) నుంచి అత్యంత వేగంగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నా, పట్టించుకోకుండా ఇరాన్ ప్రజలు చేస్తున్న పిచ్చి పనికి అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.