చెన్నైకి వణుకుపుట్టించిన రాజస్థాన్

 

ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతివరకూ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక బంతి మిగిలి వుండగానే 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ మొదటి నుండే దూకుడు ప్రదర్శించింది. తొలి వికెట్ కు ఓపెనర్ షేన్ వాట్సన్మ్ అజ్నింకా రహానే 71 పరుగులు జోడించారు. రహానే 15 బంతుల్లో 16 పరుగులు (1 బౌండరీ) చేసిన తరువాత అశ్విన్ క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. వాట్సన్ కు జతకలిసిన యాజ్ఞిక్ 7ను కూడా అశ్విన్ కాట్ అండ్ బౌల్ ద్వారా వెనక్కి పంపాడు. రాజస్థాన్ కెప్టెన్ ద్రావిడ్ (6) క్రీజ్ లోకి వచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. డ్వేన్ బ్రావో వేసిన బంతికి కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ వాట్సన్ కు చక్కటి సహకారం అందిస్తూ దూకుడుగా ఆడాడు. బిన్నీ 22 బంతుల్లో 36 పరుగులు (3 బౌండరీలు 1 సిక్సర్) నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ షేన్ వాట్సన్ ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న వాట్సన్ 60 బంతుల్లోనే సెంచరీ పూర్తీ చేసుకున్న తరువాత డ్వేన్ బ్రావో బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి ఎక్స్ ట్రా కవర్ లో హస్సీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ దారి పట్టాడు. ఐపీఎల్-6 లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. బ్రాడ్ హాడ్జ్ 9 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. అశ్విన్ 2, డ్వేన్ బ్రావో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం భారీగా ఉండడంతో మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ మురళీ విజయ్ 3 చండీలా కాట్ అండ్ బౌల్ నిరాశ పరిచినా మైక్ హస్సీ చెలరేగి ఆడాడు. మైక్ హస్సీకి సురేష్ రైనా తోడవడంతో వీరిద్దరూ 61 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. సురేష్ రైనా 35 బంతుల్లో 51 పరుగులు (4 బౌండరీలు 2 సిక్సర్లు) చేసి ఫాల్కనర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. చెన్నై కెప్టెన్ ధోని, హస్సీతో కలిసి మూడో వికెట్ కు 42 జోడించిన తరువాత 19వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన ధోని, ఫాల్కనర్ బౌలింగ్ లో స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మైక్ హస్సీ 51 బంతుల్లో 88 అప్రుగులు (13 బౌండరీలు 1సిక్సర్) చేసిన తరువాత ద్రావిడ్ స్ట్రైట్ త్రో తో రనౌట్ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే 'సర్' రవీంద్ర జడేజా 0 పరుగులకు ఫాల్కనర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా బ్రేవో 9 బంతుల్లో 15 పరుగులు (1 సిక్సర్) 20వ ఓవర్ ఐదవ బంతికి భారీ సిక్సర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది. ఫాల్కనర్ 3, చండీలా 1 వికెట్లు తీశారు. షేన్ వాట్సన్ సెంచరీ వృధా అయ్యింది. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియన్ సహచరుడు మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు విజయాలు నమోదు చేసినప్పటికీ రన్ రేట్ ఆధారంగా చెన్నై ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ గా నిలిచింది.

గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 17)  కాకినాడలో  పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారు  రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా చెబుతున్న ప్రతిష్ఠాత్మక  గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ  13 వేల కోట్ల రూపాయల వ్యయంతో  ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఏడాదికి  మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను, భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా  ప్రత్యక్షంగా, పరోక్షంగా పాతిక  వందల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రద్దీ ఏర్పడింది. ఏపీ నుంచి    పండగ పూర్తి చేసుకొని   హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. శని, ఆది (జనవరి 17, 18) వారాలలో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుందన్న అంచనాలు ఓ పక్క,  జాతీయ రహదారిపై  పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు మరో పక్క ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  నల్గొండ జిల్లా పోలీసు శాఖ ట్రాఫిక్ మళ్లింపు చేపట్టింది. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ ట్రాఫిక్ మళ్లింపు వివరాలను ప్రకటించారు.  గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను  మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు  మాచర్ల , నాగార్జునసాగర్ , పెద్దవూర , కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా ట్రాఫిక్ ను మళ్లిస్తారు.  అదే విధంగా నల్లగొండ నుంచి  హైదరాబాద్   వెళ్లే వాహనాలను నల్లగొండ , మార్రిగూడ బై పాస్ , మునుగోడు, నారా యణపూర్, చౌటుప్పల్  మీదుగా హైదరాబాద్ కు చేరుకోవలసి ఉంటుంది.  ఇక విజయవాడ నుంచివి  హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తారు.  

చదువు ఒక్కటే పేదిరికాన్ని పోగొడుతుంది : సీఎం రేవంత్‌

  మాదాపూర్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తాము రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.  గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మితే వారికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేదని తెలిపారు. టీజీపీఎస్సీ ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం....యూపీఎస్సీ ని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశామని సీఎం స్ఫష్టం చేశారు. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశామన్నారు.  ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షి గా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశామని ఆయన తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది.. పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని.. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని చెప్పారు. 10 ఏళ్ల‌లో రెండు సార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదని విమర్శించారు. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది.. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలని సీఎం రేవంత్ తెలిపారు.

మంగళగిరి ప్రీమియర్ లీగ్‌లో సందడి చేసిన మంత్రి లోకేష్

  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో  నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ పోటీల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ముందుగా బోగి ఎస్టేట్స్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ ఆఖరి మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ టాస్ వేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. వల్లభనేని వెంకట్రావ్ యూత్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ను ఎంచుకుంది. అనంతరం ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ను మంత్రి లోకేష్ వీక్షించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య,  ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.

లక్కుండిలో లంకె బిందెలు...నిధి కోసం ప్రభుత్వ వేట

  కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే. 634 గ్రాముల బరువున్న ఆ తామరపు బిందెలో 466 గ్రామలు బంగారు గాజులు, కడియాలు, గొలుసు, ఉంగరాలు బయటపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో నిధి కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం (16-1-26) నుంచి లక్కుండిలో నిధి కోసం వేట మొదలుపెట్టారు.  అక్కడి కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిధుల కోసం పుర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రాక్కులు, ట్రాక్టర్‌లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్‌మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి.  పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణాలు ముద్రించినట్లు అధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతం 14వ శతాబ్దంలో ప్రధాన నగరంలో ఉండేదని చారిత్రక ఆధారులున్నాయి. భుగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాడి ఉండొచ్చని, వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్కుండిలో లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు.

అంధ రచయిత్రి రాసిన నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

  మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో కుటుంబంతో సహా సాయిజ్యోతి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అంధురాలైన సాయిజ్యోతి మొబైల్ లో వాయిస్ ఇన్ పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రచనలు చేస్తున్నారు.  ‘చైత్రశ్రీ’ కలం పేరుతో కవితాంజలి అనే కవితా సంపుటితో పాటు ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ అనే నవలలు, సామాజిక స్పృహ కలిగించే కథలు రచించారు. నూతక్కి హైస్కూల్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తున్నారు. వైకల్యాన్ని జయించి తన ప్రతిభతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన సాయిజ్యోతిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బీహార్‌లో ట్ర‌క్కు ఢీకొని బాలుడు మృతి…మానవత్వం మరిచిన జనం

  బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతే… మరోవైపు అదే ప్రమాదానికి కారణమైన ట్రక్కు నుంచి కింద పడిన చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని పట్టించుకోకుండా చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజిహాట్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రితేష్ కుమార్ ఉదయం సైకిల్‌పై కోచింగ్ క్లాస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. అందులో ఉన్న చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెలవిసేలా రోదిస్తుంటే… మరోవైపు కొందరు స్థానికులు మాత్రం ఆ దృశ్యాన్ని పట్టించుకోకుండా చేపలను తీసుకెళ్లడంలో మునిగిపోయారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మానవత్వం ఎక్కడ పోయింది?” అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలుడి మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   https://publish.twitter.com/?url=https://twitter.com/SomuAnand_/status/2012079958672458099#

యాంకర్ అనసూయ ఫిర్యాదు... 42 మందిపై కేసు

  ప్రముఖ యాంకర్, సినీ నటి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై క్రిమినల్ డిఫమేషన్, సెక్సువల్ హెరాస్‌మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  తనను లక్ష్యంగా చేసుకుని అశ్లీల వ్యాఖ్యలు చేయడం, లైంగిక దూషణలకు పాల్ప డటం, బెదిరింపులు పంపడం వంటి చర్యలు జరుగుతు న్నాయని ఆమె ఆరోపిం చారు. కొందరు కావాలనే క్యాంపెయిన్ తరహాలో తనపై దాడి చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతే తనపై ఈవిధంగా ట్రోలింగ్ మొద లైందని అనసూయ తెలి పారు.  తాను చేసిన వ్యాఖ్య లను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారని అనసూయ తన  ఫిర్యాదులో పేర్కొ న్నారు. కొందరు ఏఐ సాంకే తికతను ఉపయోగించి మార్ఫింగ్, ఫోర్జరీ కంటెంట్ సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు.బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని వీరితోపాటు మరికొందరిపై అనసూయ ఫిర్యాదు చేసింది.  అంతేకా కుండా నిందితుల పేర్లతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాల లింకులను కూడా అనసూయ తన ఫిర్యాదుతో జత చేసి పోలీసులకు సమర్పించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని తో సహా మొత్తం 42 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవస రమైతే నిందితులను అదుపులోకి తీసుకుం టామని తెలిపారు. ప్రస్తుతం నిందితుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు, పోస్టులు, వీడియోలను సేకరించి సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.