Read more!

మాల్దీవుల్లో ఇండియన్ పై గ్యాంగ్ రేప్

 

 

 

 

మాల్దీవుల్లోనూ ఇండియాకు చెందిన టీచర్ గ్యాంగ్ రేప్ కు గురైంది. మాలెలో ఆసుపత్రి లో చికిత్స పోందుతున్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలీఫ్ దాల్ అటార్ లోని ధంగేతి అనే పట్టణంలో బాధితురాలు ఇటివలే కంప్యూటర్ స్కూల్ లో టీచర్ చేరింది. ఆమెపై కొందరు దుండగులు ఆదివారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను పోలీసులు హాస్పటల్ కి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం భారత్ కు తీసుకువెళ్తామని బాధితురాలి బంధువులు తెలిపారు.యువతి పరిస్థితిపై మాలెలోని భారత రాయబార కార్యాలయ అధికారులు మాల్దీవుల మంత్రి మరియమ్ షకీలతో మాట్లాడారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి శిక్షిస్తామని ఆమె తెలిపారు.