అలా చేస్తే మేం పీవోకే లోకి ప్రవేశించాల్సి వస్తుంది.. పాక్ కు భారత్ హెచ్చరిక
posted on Oct 10, 2016 @ 12:08PM
భారత్ చేసిన సర్జికల్ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఇప్పటికే పలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడుతుంది. అయితే ఈ విషయంలో భారత్ ఇప్పుడు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పాక్ భూభాగంలోకి చొరబడి దాడులు చేశాం.. ఉగ్రవాదులకు ఇదే విధమైన మద్దతు పాక్ నుంచి లభిస్తే మాత్రం ఎల్ఓసీ నిబంధనలను తాము పాటించబోమని, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశిస్తామని మరోసారి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పాక్ వైపు నుంచి చొరబాట్లు ఆగని పక్షంలో, ఇండియా వైపు నుంచి కూడా చొరబాట్లు చేసే హక్కు తమకుందని వెల్లడించినట్టు తెలిపారు. ఎల్ఓసీ వెంబడి వున్న పాక్ గ్రామాల నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని, వీటిని పాక్ సైన్యం దగ్గరుండి ప్రోత్సహిస్తూ, ఆపై వారు జరిపే మారణకాండను చూస్తోందని ఆరోపించిన భారత్, ఇకపై అలా జరగనివ్వబోమని పాక్ కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.