గురువారం రాత్రి ఫ్లై ఓవర్లు బంద్!
posted on Mar 11, 2021 @ 3:27PM
హైదరాబాద్లోని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు మూత పడనున్నాయి. నగరంలోని అన్ని ప్లై ఓవర్లను మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు గ్రీన్ల్యాండ్స్, లంగర్హౌస్ ఫ్లైఓవర్లు, పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మినహా హైదరాబాద్లోని అన్ని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి మూసివేయనున్నారు.జగ్నేకీ రాత్ నేపథ్యంలో హైదరాబాద్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే భారత్ లో ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిర్ పోలీసులు సూచించారు.