గర్భిణీలకు కరోనా టెస్టు తప్పనిసరి!
posted on Mar 27, 2020 @ 12:17PM
గర్భిణీల నుంచి శిశువుకు కరోనా వస్తుందా... అంటే అవుననే అంటున్నారు చైనా డాక్టర్లు. ఇటీవల చైనాలో ఓ గర్భిణీ డెలీవరి కోసం హాస్పిటల్ లో జాయిన్ అయింది. అయితే ఆమె కాస్త అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు పరీక్షలు చేసి కరోనా ఉందని నిర్ధారించారు. ముందుజాగ్రత్తగా యాంటీ వైరల్ డోస్ లు ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ గర్భసంచికి పాకింది. డెలివరీ తర్వాత శిశువు హెల్త్ చెక్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది.
బరువు, హార్ట్ బీట్ అన్నీ సరిగ్గానే ఉన్నా కరోనా వైరస్ శిశువుకు సోకిందని డాక్టర్లు చెబుతున్నారు. 'పుట్టిన వెంటనే రక్తనమూనాలను సేకరించి బ్లడ్ టెస్టులు చేశాం. పాపకు కరోనా పాజిటివ్ వచ్చింది' అని వైద్యులు అంటున్నారు.
చైనాలో మరో 33మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ప్రసవం తర్వాత రెండ్రోజుల వరకూ టెస్టులు చేయకపోవడంతో యాంటీ డోసుల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. కొందరు రీసెర్చర్లు తల్లికి ఉన్న కరోనా పాపకు కచ్చితంగా వచ్చి తీరుతుందని దానిని తప్పించలేమని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సమయంలో గర్భిణీలు ప్రసవానికి సిద్ధమవుతుంటే కరోనా టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే.