ప్రసంగిస్తూ కుప్పకూలిన సీఎం
posted on Feb 15, 2021 8:14AM
పంచాయతీ ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి .. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వేదికపైనే పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానిక నాయకులు ముఖ్యమంత్రిని హాస్పిటల్ కు తరలించారు.
గుజరాత్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల జరుగుతున్నాయి. వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభకు సీఎం విజయ్ రూపాని హాజరయ్యారు. ఆయన సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. ముఖ్యమంత్రి పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే అహ్మదాబాద్ కు తరలించి, ఆసుపత్రిలో చేర్చారు.
గత రెండు రోజులుగా సీఎం విజయ్ రూపాని స్వల్ప అస్వస్థతతో ఉన్నారని చెబుతున్నారు. అయినా ఆయన ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని తెలుస్తోంది. బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ తప్పారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వెల్లడించారు.