రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్
posted on Apr 25, 2020 @ 12:15PM
రంజాన్ మాసం లో ప్రత్యేక సడలింపు లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మసీదు లో ప్రార్థనల అంశం లో ఇప్పటికే 5 మందికి మినహాయింపు.
ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురికి ప్రార్థనలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం .
రంజాన్ పండుగకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు .
24 గంటల విద్యుత్ సరఫరా, అవసరానికి సరిపడా మంచి నీటి సరఫరా .
నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు షాపు లకు ఉదయం 10 గంటల వరకు అనుమతి .
ఇఫ్తార్ కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు అనుమతి .
ఆహారం అందించే డోనర్స్ కు ఉదయం 3 నుండి 4.30 వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు అనుమతి .
ఈ అనుమతులు కేవలం మూడు నుండి నాలుగు పాయింట్ లు గుర్తించి ఇవ్వాలని ఆదేశం .
హోటల్స్ ను గుర్తించి సెహ్రి, ఇఫ్తార్ సమయాల్లో టేక్ అవే లకు అనుమతి .
క్వరంటెన్ లో ఉన్న ముస్లిం లకు పండ్లు, డ్రై ఫ్రూట్ తో ఉదయం, సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశం .
ఇమామ్ లకు, మైజిం లకు పాసులు.
అన్ని మసీదుల వద్ద కోవిడ్ 19 నియంత్రణలు తెలుపుతూ బ్యానర్ ఏర్పాటు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం .బౌతిక దూరం వర్తింపచేస్తూ అన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు.