ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని టీఆర్ఎస్
posted on Jan 2, 2016 9:27AM
తెలంగాణలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చేలా కనిపించడంలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో అన్నిచోట్లా టీఆర్ఎస్ పార్టీ జెండాలు.. హోర్డింగులతో నింపేశారు. హైదరాబాద్ లోని మొత్తం భారీ హోర్డింగులను అధికార పార్టీ గత రెండు నెలల కిందటే గుత్తకు తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు హైదరబాద్ లోని మెజారిటీ బస్టాండ్ల హోర్డింగులనూ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఈ హోర్డింగుల్లో పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తోంది. మొత్తానికి అధికార పార్టీ.. ప్రతిపక్షాల ప్రచారానికి ఎక్కడా చోటు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరి ప్రతిపక్షపార్టీలు ఏం చేస్తాయో చూడాలి.