బీజేపీ నేత దాడి వెనుక లేడీ కానిస్టేబుల్ హస్తం..
posted on Aug 13, 2016 @ 12:03PM
బీజేపీ సీనియర్ నాయకుడు బ్రిజ్పాల్ టియోటియాపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన కారును మార్గ మధ్యంలో ఆపి దుండగలు ఏకే 47 రైఫిళ్లతో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ దాడిలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఓ మహిళా కానిస్టేబుల్ అని తేలింది. ఆమెను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా మహిళా కానిస్టేబుల్ సునీత భర్త.. రాకేష్ హసన్పూరియా. అతడు ఓ గ్యాంగ్స్టర్. 2003లో పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. తన భర్త మృతికి బ్రిజ్పాలే కారణమని సునీత అప్పట్లో ఆరోపించింది. బ్రిజ్పాల్ గతంలో ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఆ కక్షతోనే ఇప్పుడు ఆయన మీద దాడి చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు.