జగన్ను కాంగ్రెస్లోకి తీసుకొస్తారేమో.. గాలి
posted on Jul 20, 2015 @ 4:36PM
టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు. పదేళ్ల యూపీఏ పాలనలో ఏనాడూ రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోలేదని.. ఇప్పుడు ఏపీలో రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్నా, రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఇప్పుడు ఏపీలో రైతు ఆత్మ హత్యలు తక్కువగా ఉన్నా రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో.. ఉన్నట్టుండి రైతుల మీద ఇంత ప్రేమ కలగడానికి కారణం ఏంటో అర్ధం కావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. వైకాపా నేతలు కలిసి నాటకాలు ఆడుతున్నారు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనిపోవడంవల్ల ఆపార్ట్టీలోని నేతలు వైకాపా లోకి చేరుతున్నారని.. ఈ నేపథ్యంలో అందరూ కలిసి జగన్ ను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువస్తారేమో అని జోస్యం చెప్పారు. పనికిమాలిన ప్రతిపక్షాలు దొరకడం ఏపీ చేసుకున్న దురదృష్టమని గాలి వ్యాఖ్యానించారు.