మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్లు జైలు
posted on Sep 14, 2022 @ 4:45PM
పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. గీతతోపాటు ఆమె భర్త రామ కోటేశ్వరరావు కు కూడా ఇదే శిక్ష విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు మోసం చేసిన కేసులో 2015లో చార్జిషీటు ఫైల్ చేశారు. దీని ఆధారంగా కోర్టు తీర్పు వెల్లడించింది. బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవైట్ లిమిటెడ్ కంపెనీకు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తపల్లి గీత సహా మిగిలిన నింది తులను అరెస్టుచేసి వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
కాగా కొత్తపల్లి గీత తరఫున హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు విచారిస్తుం దా? లేక వాయిదా వేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. 2015లో కేసు రిజిష్టర్ అయిన తర్వాత సుదీ ర్ఘంగా వారికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. విచారించి చార్జిషీటును దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ మేరకు వారికి జైలు శిక్ష విధించింది.
విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ స్కామ్కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించిన సీబీఐ కోర్టు. మంగళవారం ఈ కేసులో తీర్పు రావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది . గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్గూడ జైలుకు తరలించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీతో దూరం జరిగారు. బీజేపీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల సమయంలో ఏ పార్టీలోనూ చేరలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన వారిలో కొత్తపల్లి గీత కూడా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది. అయితే చేరలేదు. ఈ లోపే ఆమె బ్యాంక్ ఫ్రాడ్ కేసులో జైలు శిక్షకు గురయింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది.
మొదట బ్యాంక్ఉద్యోగిగా పనిచేసి తర్వతా గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. 1999వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ్ సబ్-కలెక్టర్ గా వివిధహోదాల్లో పనిచేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్), రెవెన్యూ డివిజనల్ ఆఫీ సర్, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్వేలో ల్యాండ్ రికార్డులు స్పెషల్ ఆఫీసర్ మొదలైన పదవులలో పనిచేశారు. హైదరాబాద్లో పని చేస్తున్న సమయంలో ఆమె భూముల అవకతవ కలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 2010లో ఉద్యోగం మానేసి భర్తతో కలిసి వ్యాపా రం ప్రారంభించారు తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో జైలు పాలవ్వాల్సి వచ్చింది.