ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు: హోంమంత్రి
posted on Feb 24, 2014 @ 9:33AM
సమైక్య రాష్ట్రంలోనే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందినప్పటికి, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత కేంద్రం సీమా౦ద్రకు నిధులు కేటాయించడానికి మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని, ఈ సమయంలో సీమాంద్రకు నిధులు కేటాయించడంపై తాము అధ్యయనం చేయాల్సి వుందని అన్నారు. విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామని పార్లమెంటులో ప్రధాని ప్రకటించనప్పటికీ, దానికి కొంత సమయం పడుతుందని అన్నారు.