తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 4) శ్రీవారిని మొత్తం 66 వేల 327 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల354 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది. కాగా శనివారం (ఏప్రిల్ 5) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. 

Teluguone gnews banner