తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on Apr 5, 2025 8:56AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 4) శ్రీవారిని మొత్తం 66 వేల 327 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల354 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది. కాగా శనివారం (ఏప్రిల్ 5) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.