Read more!

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 15) శ్రీవారి ర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఏప్రిల్ 14) శ్రీవారిని మొత్తం 81 వేల 57 మంది దర్శించుకున్నారు.

వారిలో 24 వేల 913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.