ప్రజలను మోసం చేస్తే చెప్పులు, రాళ్ళే పడతాయి..పేర్ని నాని
posted on Apr 15, 2024 6:38AM
ప్రజల్ని మోసం చేసిన వాళ్ళ మీద చెప్పులు రాళ్ళే పడతాయని వైసీపీ నాయకుడు పేర్ని నాని అన్నారు. ప్రజలు కోపంతో తిరుగుబాటు చేస్తున్నారని, అందుకే చెప్పులు, రాళ్ళు విసురుతున్నారని ఆయన చెప్పారు.
ఈ వ్యాఖ్యలు గతంలో చంద్రబాబును ఉద్దేశించి ఆయనగారు చేశారు. ఇప్పుడు జగన్ తన మీద తానే చెప్పు దాడి, గులకరాయి దాడి జరిపించుకుంటున్న నేపథ్యంలో జనం పాత వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటున్నారు.
ఒకవేళ వైసీపీ నేతలు చెబుతున్నట్టు ఇవి జనం నిజంగానే చేస్తున్న దాడులైతే, అవి ప్రజల్ని జగన్ మోసం చేసినందుకు ప్రజల నుంచి అందుతున్న బహుమతులుగానే భావించాలి.