సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో పెరుగుతున్న అవినీతి?
posted on Jun 19, 2012 @ 10:43AM
రాష్ట్రంలోని సబ్ రిజిస్త్రార్ కార్యాలయాలు అవినీతికి వేదికలవుతున్నాయి. ఇటీవల ఎసిబికి అందిన దరఖార్సుల్లో ఎక్కువభాగం సబ్ రిజిస్టారు అవినీతి మీదే అని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాకినాడ సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో సీనియర్ రిజిస్ట్రారు పదివేల రూపాయలతో దొరికిపోయారు. అలానే దస్తావేజు లేఖర్ల నుంచి కూడా అవినీతి వాటా కింద 47వేల రూపాయలు దొరికింది. ఆ తరువాత రాజమండ్రిలోనూ ఈ అవినీరి ఆరోపణలు వినిపించాయి. అనంతపురం జిల్లాలోనూ సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు అవినీతికి మారుపేరని గుర్తించారు. నకిలీ చలానాలతో సుమారు పదిలక్షల రూపాయలు లబ్ది పొందారని వెలుగులోకి వచ్చింది. సబ్ రిజిస్ట్రారు, ఇద్దరు అటెండర్లను డిఐజి గిరిబాబు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులను వదలకుండా ఈ కార్యాలయాల్లో సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ధర్మవరం సబ్ రిజిస్ట్రారు రెండు లక్షల రూపాయలతో దొరికిపోయారు. ఐదేళ్ళ క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలోనూ అవినీతి భాగోతం వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని కార్యాలయాలూ అవినీతికి నిలయాలే అని ఆ జిల్లా నేతలు ఆందోల వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రారుకు అటెండర్ల ద్వారా అవినీతి వాటాలు అందుతున్నాయని వారు ఆ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఎసిబి కూడా వరుసగా రిజిస్ట్రారు కార్యాలయాలపై దాడులు ప్రారంభిచి మధ్యలో ఆపేసింది. తిరిగి ఆ తరహాలోనే దాడులు కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.