దేశంలో కరోనా నీడ పడని ప్రాంతాలున్నాయా?
posted on Apr 15, 2020 @ 10:26AM
అవును. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదు. లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి, డామన్-డయ్యూ, సిక్కింలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు మాత్రమే నమోదైంది.
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొత్తం 10,815 నమోదు కాగా 1189 మంది కోలుకున్నారు. కరోనాతో 353 మంది మరణించారు. ప్రస్తుతం 9272 యాక్టివ్ కేసులున్నాయి. ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తుండటం కలవరపెడుతోంది.