ఏపీలో వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు
posted on Jul 30, 2020 @ 6:46PM
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ ను పరీక్షించగా.. 10,167 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557 కి చేరగా, మరణాల సంఖ్య 1,281 కి చేరింది. ఇప్పటివరకు 60,024 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 69,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,90,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.