ఏపీలో ఒక్క రోజే 3963 పాజిటివ్ కేసులు
posted on Jul 18, 2020 @ 5:15PM
ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్క రోజే 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609 కి చేరింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసులలో సింగిల్ డే హయ్యెస్ట్ రికార్డ్. ఈ రోజు వచ్చిన పాజిటివ్ కేసులలో 993 కేసులు ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదయ్యాయి. దీని తరువాత స్థానంలో 550 కేసులతో కర్నూల్, 407 కేసులతో పశ్చిమ గోదావరి, 343 కేసులతో చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. నిన్న ఒక రోజులోనే 52 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 22,260 మంది వివిధ హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాక ఇప్పటివరకు 21,763 మందికరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.