జయలలిత ఆరోగ్యంపై కోర్టులో పిటషన్...
posted on Oct 3, 2016 @ 4:16PM
గత 13 రోజులుగా తమిళనాడు సీఎం జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యంపై పలు వదంతులు కూడా వస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే నేతలు.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంగతైతే చెప్పనక్కర్లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేస్తున్నారు. ఇక లండన్ నుండి వచ్చిన వైద్యులు ఆమె ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందని.. అయితే కోలుకోవడానికి సమయం పడుతుందని అంటున్నారు. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు జయలలిత ఆరోగ్యం గురించి బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ కూడా ధాఖలైంది. జయ ఆరోగ్యానికి సంబంధించి వాస్తవ పరిస్థితులు బయటపెట్టాలని చెన్నైకి చెందిన న్యాయవాది ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు రేపు విచారణ జరపనుంది.