మాట నిలబెట్టుకున్న అమ్మ... గర్భిణీలకు శుభవార్త..
posted on Sep 1, 2016 @ 3:48PM
వరాలు ఇవ్వాలన్నా.. వాటిని నిలబెట్టుకోవాలన్నా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అందుకే తమిళనాడు వాసులు ఆమెకు అంత గౌరవం ఇస్తారు. ఇప్పుడు కూడా తాను ఇచ్చిన మరో హామిని నిలబెట్టుకొని శభాస్ అనిపించుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగలుకు ప్రసూతి సెలవులను ఆరు నెలల నుంచి 9 నెలలకు పెంచుతానని గత ఎన్నికల్లో జయలలిత హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె అనుకున్నట్టుగానే ప్రసూతి సెలవులను పెంచారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ''2011లో మా ప్రభుత్వం ప్రసూతి సెలవులను 90 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇప్పుడు ఆరు నెలల నుంచి 9 నెలలకు పెంచుతున్నాం'' అని జయలలిత ప్రకటించారు. అలాగే కోట్లాది రూపాయలు వెచ్చించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరిస్తామని.. అందులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.