కొత్త ఐడియాలు కావాలంటున్న చంద్రబాబు
posted on Sep 18, 2015 @ 3:57PM
రైతు రుణమాఫీపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో రుణమాఫీ సక్రమంగా అమలు జరుగుతున్నా, కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని బాబు మండిపడ్డారు. కలెక్టర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రుణమాఫీపై సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు, రుణమాఫీపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్లకు ఆదేశించారు. విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు... ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చినా, ఇంకా కొన్నిచోట్ల పవర్ కట్స్ జరుగుతున్నాయని మండిపడ్డారు. బోగస్ కార్డులు ఏరివేసి, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయాలని కలెక్టర్లకు బాబు దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు నిత్యం ప్రజల్లో ఉండాలన్న సీఎం, స్టేట్ డెవలప్ మెంట్ కు కొత్త ఐడియాలు ఇవ్వాలంటూ కోరారు.