పాక్ ఉగ్రదాడి.. ఉగ్రవాదులు మృతి
posted on Oct 3, 2016 @ 10:26AM
భారత్ -పాక్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ చేసిన సర్జికల్ దాడులకు గాను పాక్ భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఉగ్రదాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లోని పలు దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు.. నిన్న రాత్రి బారాముల్లా సెక్టార్ లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు తిరిగి కాల్పులు జరపగా.. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదలు మరణించగా..ఒక జవాను మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్మీ సెంటర్ లోకి ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చొరబడి ఉండవచ్చని.. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని.. ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నట్టు సైన్యాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు బారాముల్లాలో పరిస్థితిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి పర్యవేక్షిస్తూనే ఉన్నారు.