Read more!

లోక్ సభ అభ్యర్థులపై టీడీపీ కసరత్తు

 

 

లోక్ సభకు ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ఉహగానాల నేపధ్యంలో పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హైకమాండ్ నిమగ్నం కాగా...రాష్ట్రంలో టిడిపి కూడా ఎంపీ అభ్యర్ధుల లిస్టును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి తెచ్చే ప్రయత్నంలో కొన్ని సీట్లకు పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులను రంగంలోకి తెచ్చే ఆలోచన టిడిపిలో జరుగుతోంది.


సినీ నటుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ కూడా లోక్ సభకు పోటిచేయవచ్చని అంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచే పోటీకి నిలిపే విషయమై ఆలోచన నడుస్తోంది. ఒంగోలు సీటుకు ఈసారి టీడీపీ తరఫున సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్ స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన అక్కడ బలమైన అభ్యర్థి కాగలరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


హిందూపురం : సినీ నటుడు బాలకృష్ణ
శ్రీకాకుళం జిల్లా : ఎర్రన్నాయుడు సతీమణి
విజయనగరం జిల్లా : అశోకగజపతిరాజు
అనకాపల్లి :  దాడి వీరభద్రరావు లేదా అయ్యన్న పాత్రుడు
రాజమండ్రి : మురళీమోహన్
కాకినాడ : యనమల రామకృష్ణ
ఏలూరు : మాగంటి బాబు
నర్సాపురం : సితామహాలక్ష్మి
విజయవాడ : వంశీ, ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, మురళి పేర్లు పరిశీలీస్తున్నారు. 
గుంటూరు : రత్తయ్య
నర్సారావుపేట: ఎంపీ వేణు గోపాల్ రెడ్డి, కోడెల శివప్రసాద్
కరీంనగర్ : మాజీమంత్రి పెద్దిరెడ్డి
మల్కాజిగిరి: మల్లేశం
సికింద్రాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్, గత అభ్యర్ధి సుధీష్ రాంబోట్ల పేర్లు పరిశీలీస్తున్నారు.