ఏపీ అసెంబ్లీలో రచ్చ.. చంద్రబాబుపై స్పీకర్ ఫైర్
posted on Dec 1, 2020 @ 3:21PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈరోజు సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై రగడ చోటుచేసుకుంది. టిడ్కో ఇళ్లకు సంబంధించిన అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో తాము మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వకపోవడంపై మండిపడుతూ.. స్పీకర్ వైపు వేలెత్తి చూపుతూ చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడే విధానం ఇది కాదని, సభాధ్యక్షుడినే బెదిరిస్తారా? అని ఫైర్ అయ్యారు. మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని, పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డు పడొద్దని చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు.