తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్...అరెస్ట్ అయిన నేతలు..
posted on Nov 28, 2016 @ 12:18PM
పెద్ద నోటలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు బంద్ లో పాల్గొన్నాయి. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అరెస్ట్ అయిన నేతలు..
చిత్తూరులో భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి
గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా, మర్రి రాజశేఖర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి
కర్నూలులో హఫీజ్ ఖాన్
విజయవాడలో సామినేని ఉదయభాను
విశాఖపట్నంలో ధనిశెట్టి బాబూరావు
తూర్పుగోదావరిలో తోట సుబ్బరాయుడు, ఆవాల లక్ష్మీనారాయణ
శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వి కళావతి
హైదరాబాదులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు
కరీంనగర్ లో ముకుందరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.