మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్య.. చంద్రబాబు తర్వాత నాదే బాధ్యత
posted on Oct 30, 2015 @ 12:10PM
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నేపథ్యంలో మంత్రి నారాయణ మీద వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ దగ్గర నుండి, రాజధాని కాంట్రాక్టర్ ను నిర్ణయించడం, మాస్టర్ ప్లాన్ తదితరాల్లో అంశాల్లో నారాయణ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఆర్డీఏలో తనదే హవా అంటూ నారాయణపై పలు విమర్సలు తలెత్తాయి. ఈ విమర్శలకు నారాయణ స్సందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు.. చంద్రబాబు తర్వాత రాజధాని బాధ్యత మొత్తం తనదేనని చెప్పారు. కావాలనే పనిగట్టుకొని కొందరు తనమీద విమర్శలు చేస్తున్నారని.. ఎవరెన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోను.. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని వెల్లడించారు. తనపై తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.