నోటుకు ఓటు కేసు.. ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు
posted on Jun 10, 2015 @ 11:50AM
ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాధపై వేటు పడే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గంతోపాటు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు అనురాధపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం.. ఆడియో టేపులు బయట పడటం.. ఫోన్లు ట్యాపింగ్ లు చేస్తుంటే ఏం చేస్తున్నారని.. ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అనురాధ కూడా ఘాటుగానే స్పందించి తెలంగాణ అధికారులు, మంత్రులపై తాము కూడా నిఘా ఉంచితే ఇప్పుడు ఏపీ అధికారులు అడిగినట్టే వాళ్లు కూడా అడిగేవారని, మా మీద కేసు పెట్టేవారని సమావేశం జరుగుతుండగానే వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు ఇంటెలిజెన్స్ చీఫ్ గా మరొకరి పేరును సూచించాలని డీజీపీ ని సీఎం ఆదేశించడంతో ఆయన సీహెచ్ ద్వారకా తిరుమలరావు, గౌతమ్ సవాంగ్ పేర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.