ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అనాసక్తి.. అక్కడికి ఇప్పుడే వెళ్లలేం...
posted on May 13, 2016 @ 10:43AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్ కల్లా ప్రభుత్వ ఉద్యోగులందరనీ ఏపీకి రప్పించడానికి చూస్తుంటే.. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుండి మాత్రం ఏపీ ఉద్యోగులు అక్కడికి వెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడంలేదు. ఇప్పటికే అక్కడ అద్దే ఇళ్లు దొరక్కా.. ఒకవేళ దొరికినా చుక్కలంటే రేట్లు.. ఇంకా ఎటువంటి మౌలిక వసతులూ లేకపోవడం వల్ల అక్కడికి ఎలా వెళ్లాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ నేత మురళీకృష్ణ మాట్లాడుతూ.. జూన్ లోగా అమరావతి వెళ్లడం సాధ్యం కాదని.. వచ్చే ఏడాది మార్చి వరకూ సమయం ఇవ్వాలని కోరారు. ఒక్కో మంత్రి ఒక్కోలా చెబుతున్నారని, 80 శాతం మంది ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, ముందడుగు ఎలా వేస్తారని.. తమ పిల్లల అడ్మిషన్లు పూర్తయ్యాయని, స్పష్టమైన హామీలు లేకుండా వెళ్లలేమని ఉద్యోగులంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను చెబుతున్నారని అన్నారు.