ఏపీ బడ్జెట్ ప్రసంగం విశేషాలు... కొన్ని...
posted on Aug 20, 2014 @ 1:47PM
లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ విశేషాలు
* 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. * 85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. * 26వేల కోట్ల ప్రణాళికా వ్యయం. * రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు. * ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు.
* విజన్ 2020కి కొత్త హంగులు.. విజన్ 2029 ఫార్ములాతో ముందడుగు. * వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్. * లక్షన్నర వరకు రైతు రుణాల మాఫీ. * రాష్ట్ర విభజన కారణంగా రెవిన్యూ లోటు ఏర్పడింది. అందువల్లే ఈ ఏడాదికి జనరంజకమైన బడ్జెట్ ఇవ్వలేకపోతున్నాం. * అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి. * విశాఖలో విమ్స్, తిరుపతిలో స్విమ్స్ కేంద్ర నిధులతో అభివృద్ధి. * విజయవాడ- కాకినాడల మధ్య గ్రీన్ఫీల్డ్ పోర్టు. * రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్.
* జేఎన్ఎన్ఆర్ఎం కింద స్మార్ట్ సిటీల అభివృద్ధి. * చిత్తూరు, కాకినాడలలో ట్రిపుల్ ఐటీ. * కాకినాడలో ప్రైవేటు రంగంలో మరో వాణిజ్య పోర్టు ఏర్పాటు. * కాకినాడలో ఎల్ఎన్జీ టర్మినల్. * విశాఖ గంగంవరం పోర్టు దగ్గర మరో ఎల్ఎన్జీ టర్మినల్. * విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్పోర్టుల విస్తరణ. * వైజాగ్- చెన్నై కారిడార్ అభివృద్ధికి ప్రాధాన్యం. * కొత్తగా 6 ఏపీఎస్పీ బెటాలియన్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు, * పేద విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు 13 బీసీ స్టడీ సర్కిల్లు ఏర్పాటు * రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్.